మహారాష్ట్ర రాష్ట్రం పుణేలోని భారతి విద్యాపీఠ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాట్రాజ్ ప్రాంతంలో బాలుర మధ్య జరిగిన గొడవలో ఒక బాలుడు దారుణంగా హత్యకు గురయ్యాడు.
ఈ కేసులో ప్రమేయం ఉన్న బాలురను పోలీసులు తీసుకెళ్తున్నప్పుడు తీసిన దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రంగా వ్యాపిస్తోంది.
వైరల్ అయిన ఆ వీడియోలో, పోలీసులు నిందితులైన బాలురను వాహనం ముందు భాగంలో కూర్చోబెట్టి తీసుకెళ్తుండగా, ఆగ్రహించిన ఒక మహిళ ఆ బాలుడిపై తన చెప్పుతో దాడి చేసిన షాకింగ్ దృశ్యాలు ఉన్నాయి. పోలీసుల భద్రతలో ఉండగానే ఈ దాడి జరిగిన సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.
బాలురను బహిరంగ ప్రదేశంలో పోలీసులు తీసుకెళ్లిన తీరు, మహిళ దాడి చేసిన సంఘటనపై డిప్యూటీ కమిషనర్ మిలింద్ మోహితే నాయకత్వంలోని పోలీస్ బృందం విచారణకు ఆదేశించింది. ఈ సంఘటనలో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన పోలీసులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
