ఉత్తరప్రదేశ్: మద్యం సేవించి తనను అవమానించిన భర్తను, కోపంతో నిప్పు పెట్టి చంపిన భార్య ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది.
దంపతులు: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేపూర్ జిల్లా, తారాపూర్ గ్రామానికి చెందిన అవధేష్ (49), అతని భార్య ప్రీతి దేవి (45) దంపతులు. వీరికి పిల్లలు లేరు.
మద్యపానం: మద్యానికి బానిసైన అవధేష్, నిన్న రాత్రి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో రూ. 100 నగదు విషయంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో అవధేష్ తన భార్యను అసభ్య పదజాలంతో దూషిస్తూ అవమానించాడు.
నిప్పు పెట్టింది: భర్త మాటలతో తీవ్ర ఆవేదనకు, ఆగ్రహానికి లోనైన ప్రీతి, మంచంపై నిద్రిస్తున్న తన భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. అర్థరాత్రి సమయంలో ఇంట్లో నుంచి దట్టమైన పొగ రావడం గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు.
అధికారుల విచారణ: సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని, అవధేష్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. విచారణలో ప్రీతి తన తప్పును ఒప్పుకోవడంతో, అధికారులు ఆమెను అరెస్టు చేసి జైలుకు తరలించారు.
