చదువులో ప్రథమ స్థానం. ఊరంతా పండగ చేసుకున్న విద్యార్థిని. ముఖ్యమంత్రి మనస్ఫూర్తిగా ప్రశంసలు. విద్యార్థిని తీవ్ర నిర్ణయం. షాక్‌లో తల్లిదండ్రులు. శోకసంద్రంలో మునిగిపోయిన గ్రామం.!

ఏలూరు జిల్లా రంపచోడవరం మండలం ఇరుళపల్లి కొత్త కాలనీకి చెందిన 10వ తరగతి విద్యార్థిని ముర్రం శివాని, ఆ ప్రాంతంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకుంటోంది.

గత 24వ తేదీన జరిగిన తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చుని అందరి ప్రశంసలు అందుకున్న ప్రతిభావంతమైన విద్యార్థిని, అనుకోకుండా ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం ఆ ప్రాంతంలో తీవ్ర శోకాన్ని నింపింది. ఈ ఘటనను చూసిన ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు సమాచారం తెలిసి బోరున ఏడ్చిన దృశ్యం అందరినీ కంటతడి పెట్టించింది.

ఇదిలా ఉండగా, విద్యార్థిని మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన పోలీసులు, దీనికి సంబంధించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి తీవ్రంగా విచారణ జరుపుతున్నారు. కొన్ని రోజుల క్రితమే ముఖ్యమంత్రితో వేదికను పంచుకుని, భవిష్యత్తు లష్యాల గురించి ఉత్సాహంగా మాట్లాడిన విద్యార్థిని ఇలాంటి ఘోర నిర్ణయం తీసుకోవడం ఆ ప్రాంత ప్రజలను, తోటి విద్యార్థులను తీరని దుఃఖంలో ముంచెత్తింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *