సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా, 2.52 కోట్ల మంది ఫాలోవర్లతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నారు.
తమిళనాడు 9వ ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లోపే, తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయం (CMO Tamil Nadu) అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీ 20 లక్షల మంది ఫాలోవర్లను దాటి ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అనుసరించే వారి సంఖ్య ఆధారంగా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అగ్రస్థానంలో ఉన్నారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ మరియు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తర్వాతి స్థానాల్లో నిలిచారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన మార్పు ఏమిటంటే, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ 45.12 లక్షల మంది ఫాలోవర్లతో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ (35.92 లక్షలు) ఐదో స్థానంలో ఉన్నారు. జాతీయ రాజకీయాల్లో బీజేపీ ముఖ్యమంత్రుల హవా కొనసాగుతున్న తరుణంలో, తమిళనాడు సీఎం కార్యాలయం డిజిటల్ ప్లాట్ఫామ్లో మెరుపు వేగంతో ఫాలోవర్లను పెంచుకుంటూ దూసుకుపోతోంది.
