“దేవాలయం దేవుడిదా.? పూజారులదా.?” దక్షణాది యాత్రలో మహిళా భక్తురాలికి జరిగిన అవమానం. ఇలా చేసేశారేంటి.? సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న నిరసన.!!

బీహార్ రాష్ట్రానికి చెందిన లలితా దేవి అనే మహిళ సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి, ప్రచారం చేయడానికి భారత్ యాత్ర చేస్తున్నారు.

ఆమె ఇప్పటికే బద్రీనాథ్, కేదార్‌నాథ్ సహా నాలుగు పుణ్యక్షేత్రాలకు, 12 జ్యోతిర్లింగాలకు యాత్ర చేసి వచ్చారు. ఈ క్రమంలో, దక్షణాది ప్రాంతంలోని ఒక ఆలయానికి దర్శనానికి వెళ్లినప్పుడు, అక్కడున్న పూజారులు ఆమెను లోపలికి అనుమతించకుండా, “ఇక్కడ నిలబడటం నిషిద్ధం, వెంటనే ఈ స్థలం నుండి వెళ్ళిపోండి” అని చెప్పి పంపించివేసినట్లు తెలుస్తోంది.

దేవుడికి చెందిన ఆలయంలో భక్తులను అనుమతించకుండా పూజారులు అధికారం చెలాయించడం సరైనదేనా అని ఈ సంఘటనపై సోషల్ మీడియాలో వివిధ వర్గాల ప్రజలు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా, సనాతన ధర్మ యాత్ర చేస్తున్న ఒక మహిళా భక్తురాలికి ఆలయంలో ఎదురైన ఈ అవమానకరమైన సంఘటన ఇంటర్నెట్‌లో తీవ్ర చర్చకు, నిరసనకు దారితీసింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *