హైదరాబాద్లోని బాలాపూర్ ప్రాంతంలో ఒక యువతి తన ప్రియుడి చేతిలోనే దారుణంగా కత్తితో పొడిచి హత్య చేయబడిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.
ఈరోజు తెల్లవారుజామున సుమారు 5 గంటల ప్రాంతంలో గోనెసంచిలో మృతదేహం ఉందని పోలీసుల ‘డయల్ 100’ హెల్ప్లైన్కు కాల్ వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న బాలాపూర్ పోలీసులు, గోనెసంచిలో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక విచారణలో మృతురాలు బీహార్కు చెందిన 21 ఏళ్ల రెహానా అని తేలింది.
పోలీసుల తీవ్ర విచారణలో, రెహానా అదే ప్రాంతానికి చెందిన అహ్మద్ సలామ్ (21) అనే యువకుడిని ప్రేమించిందని, అతన్ని వెంటనే వివాహం చేసుకోవాలని నిరంతరం ఒత్తిడి తెచ్చిందని వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై ఇద్దరి మధ్య జరిగిన తీవ్ర వాగ్వాద సమయంలో ఆగ్రహానికి గురైన అహ్మద్, రెహానాను కత్తితో పొడిచి చంపాడు. ఆ తర్వాత హత్యను కప్పిపుచ్చడానికి శవాన్ని గోనెసంచిలో కుక్కి అక్కడి నుండి పరారయ్యాడు. పరారీలో ఉన్న నిందితుడు అహ్మద్ కోసం గాలిస్తున్న పోలీసులు, ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.
