ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో, బిసిఏ (BCA) మొదటి సంవత్సరం చదువుతున్న స్మృతి పాండే అనే 17 ఏళ్ల కళాశాల విద్యార్థిని, తన సొంత ఇంట్లోనే గొంతు కోసి అత్యంత దారుణంగా హత్యకు గురైంది.
ఈ సంఘటన గురించి సమాచారం అందుకుని హుటాహుటిన వచ్చిన పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో, అదే తరగతిలో చదువుతున్న దేవాంశ్ పాఠక్ అనే సహవిద్యార్థే ఈ దారుణ చర్యకు పాల్పడినట్లు తేలింది.
హత్య జరిగిన స్థలంలోనే గాయాలతో కనిపించిన నిందితుడు దేవాంశ్ పాఠక్ను పోలీసులు తక్షణమే అరెస్టు చేశారు. ఆ విద్యార్థిని వేరొక వ్యక్తితో సన్నిహితంగా మాట్లాడుతోందనే అనవసరమైన అనుమానంతోనే, ఆగ్రహంతో విద్యార్థిని ఇంట్లోకి చొరబడి ఈ హత్యకు ఒడిగట్టినట్లు తెలిసింది. ఈ దిగ్భ్రాంతికర హత్య సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని, భయాందోళనలను రేకెత్తించింది.

Leave a Reply