మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రీవాలో ఉన్న పంగాట్ హోటల్లో జరిగిన ఒక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తోంది.
తన భర్త మరో మహిళతో హోటల్ గదిలో గడుపుతున్నాడనే రహస్య సమాచారం భార్యకు అందింది. వెంటనే ఆ హోటల్కు చేరుకున్న భార్య, అనుమానం ఉన్న గది తలుపు తట్టింది. తలుపు తీయగానే, లోపల తన భర్త మరో మహిళతో ఉండటం చూసి ఆమె ఆవేశం కట్టలు తెంచుకుంది.
ఏమాత్రం వెనకాడకుండా తన భర్త చెంపలు వాయించడం మొదలుపెట్టింది. పరిస్థితి చేయి దాటిపోవడంతో, భర్త భయపడి “నేను కావాలని రాలేదు, ఈమెనే నన్ను తీసుకువచ్చింది” అని ఆ మహిళపై నిందలు వేశాడు. వెంటనే ఆ మహిళ, “ఇతనికి పెళ్లయిందని నాకు తెలియదు, నాది ఇంకా ఆడుకునే వయసే” అని చెబుతూ అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించింది.
అయితే, భార్య వదలకుండా భర్తను కొడుతూనే పోలీసు స్టేషన్కు ఈడ్చుకెళ్లింది. అక్కడ కూడా ఆ భర్త, “నాకు భార్యతో కలిసి జీవించడం ఇష్టం లేదు, నాకు విడాకులు కావాలి, ఆ మహిళనే పెళ్లి చేసుకుంటాను” అని మొండికేయగా, భార్య “నిన్ను అంత సులభంగా వదిలిపెట్టను, విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదు” అని తెగేసి చెప్పింది. దీనితో ఆ పోలీసు స్టేషన్ కొద్ది గంటల పాటు రచ్చరచ్చగా మారింది.
