“ప్రేయసితో కారులో వెళ్తున్న పోలీస్..! “చిన్నగా తగిలితే ఇంత గొడవా”..? బైకులపై వచ్చి నడిరోడ్డుపై చితకబాదిన రౌడీ ముఠా. ప్రేయసి కళ్లెదుటే జరిగిన దారుణం.. షాకింగ్ వీడియో..!”

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో, తన ప్రేయసితో కారులో వెళ్తున్న ట్రాఫిక్ పోలీస్ అధికారిని 14 మంది సభ్యుల ముఠా నడిరోడ్డుపై భయంకరమైన ఆయుధాలతో దారుణంగా దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

నాగ్‌పూర్‌లో ట్రాఫిక్ పోలీస్‌గా పనిచేస్తున్న 35 ఏళ్ల కుర్నాల్ సింగ్, జూన్ 28న తన ప్రేయసితో కలిసి కారులో వెళ్తున్నాడు. ఆ సమయంలో వెనుక బైక్‌లపై వచ్చిన కొందరు వ్యక్తులు అకస్మాత్తుగా కుర్నాల్ సింగ్ కారును ఢీకొట్టారు. దీంతో షాక్‌కు గురైన ఆయన, ఏం జరిగిందో అడిగేందుకు కారును రోడ్డు పక్కన ఆపి కిందకు దిగారు.

ఆయన కిందకు దిగిన మరుక్షణమే, బైకులపై వెంబడిస్తూ వచ్చిన 14 మంది సభ్యుల ముఠా తమ వద్ద దాచి ఉంచిన భయంకరమైన ఆయుధాలను తీసి, కుర్నాల్ సింగ్‌పై విచక్షణారహితంగా దాడి చేయడం ప్రారంభించారు. ప్రేయసి కళ్లెదుటే నడిరోడ్డుపై జరిగిన ఈ క్రూరమైన దాడిలో కుర్నాల్ సింగ్ రక్తపు మడుగులో పడి తీవ్రంగా గాయపడ్డారు. కేకలు విని పరుగున వచ్చిన స్థానికులు, ఆయనను రక్షించి వెంటనే చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దాడికి పాల్పడిన 14 మందిని అరెస్టు చేసి, వారి వద్ద ఉన్న 5 బైకులను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ అధికారి అని కూడా చూడకుండా నడిరోడ్డుపై ముఠా దారుణంగా దాడి చేస్తున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అరెస్టయిన 14 మందిని పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు. కారుకు చిన్నగా తగిలిన విషయంలో జరిగిన గొడవ వల్లనే ఈ దారుణం జరిగిందని తెలుస్తుండగా, ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *