చిక్కబళ్లాపూర్ జిల్లా రంగస్థల గ్రామంలోని రంగధామ సరస్సులో తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్యకు పాల్పడ్డ విషాద ఘటన వెలుగులోకి వచ్చింది.
బద్గనహళ్లి గ్రామానికి చెందిన లావణ్య (30), ఆమె కుమార్తెలు నిహారిక (10), నేహ (6) గురువారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయారు. శుక్రవారం స్థానికులు సరస్సులో మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, లావణ్య తన భర్త జయన్నతో గొడవపడినట్లు తెలుస్తోంది. జయన్న దేవనహళ్లి విమానాశ్రయంలో డ్రైవర్గా ఉద్యోగం చేయాలని లావణ్య ఒత్తిడి చేసిందట. పిల్లల చదువు కోసం తాను ఒంటరిగా శ్రమించడం కష్టమని చెప్పినప్పటికీ, జయన్న ఉద్యోగానికి వెళ్లడాన్ని తిరస్కరించాడట. దీంతో మానసికంగా కుంగిపోయిన లావణ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భార్యా పిల్లలను కోల్పోయిన జయన్న తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. మూడు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిక్కబళ్లాపూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Leave a Reply