మిత్రదేశంగా ఉంటే సరిపోదు.. ఆ ఉద్రిక్తతలో ‘మిత్రుడు’ ఎవరో, ‘శత్రువు’ ఎవరో గుర్తించే తెలివితేటలు ఉండాలి! అమెరికా గర్వాన్ని కువైట్ నేలమట్టం చేసింది! ఆకాశంలో వచ్చేది ఎవరో గుర్తుపట్టలేని వారు ఇరాన్తో యుద్ధం చేస్తారా?
మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్రరూపం దాల్చుతున్న వేళ, కువైట్లో మూడు అమెరికన్ F-15 రకానికి చెందిన యుద్ధ విమానాలు కూలిపోవడం ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
మొదట ఇది ఇరాన్ దాడి అని భావించినప్పటికీ, ప్రస్తుతం అమెరికా సైన్యం ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది. ఇరాన్ క్షిపణులు మరియు డ్రోన్లను ఎదుర్కొంటున్న ఉద్రిక్త పరిస్థితుల్లో, కువైట్ వైమానిక దళం పొరపాటున అమెరికాకు చెందిన మూడు F-15 యుద్ధ విమానాలను కూల్చివేసింది. దీనిని ‘ఫ్రెండ్లీ ఫైర్’గా అమెరికా ధృవీకరించింది.
మార్చి 1వ తేదీ రాత్రి 11:03 గంటల ప్రాంతంలో, అమెరికా చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’కి మద్దతుగా ఎగురుతున్న మూడు F-15E స్ట్రైక్ ఈగిల్ విమానాలను శత్రు విమానాలుగా భావించి కువైట్ దళాలు దాడి చేశాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు విమాన సిబ్బంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.
కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఈ ఘటనను అంగీకరించింది. క్షతగాత్రులైన పైలట్లను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇరాన్ వరుసగా మూడవ రోజు క్షిపణి దాడులను కొనసాగిస్తుండగా, మిత్రదేశాల మధ్య సరైన సమాచార మార్పిడి లేకపోవడం ఈ గందరగోళానికి కారణమైంది.
F-15 ఈగిల్ విమానాలు 1976లో ప్రవేశపెట్టబడ్డాయి. 2026 నాటి గణాంకాల ప్రకారం, వైమానిక యుద్ధాల్లో వీటికి ఓటమే లేని రికార్డు ఉంది. కానీ, ఇప్పుడు శత్రువుల వల్ల కాకుండా మిత్రదేశం వల్లే ఇవి కూలిపోవడం గమనార్హం. ఈ ప్రమాదాన్ని ఒక దురదృష్టకర సంఘటనగా అభివర్ణించిన అమెరికా, పైలట్ల ప్రాణాలను కాపాడినందుకు కువైట్కు కృతజ్ఞతలు తెలిపింది.

Leave a Reply