అమెరికా ఆధిపత్యానికి ముగింపు: సుమారు 70 ఏళ్ల కష్టం, వేల కోట్ల డాలర్ల పెట్టుబడి, అత్యాధునిక ఆయుధాలు, పటిష్టమైన సైనిక వ్యూహాలు.. ఇవన్నీ కేవలం 4 రోజుల్లోనే కుప్పకూలిపోయాయి. మధ్యప్రాచ్యంలో (Middle East) అమెరికా దశాబ్దాలుగా నిర్మించుకున్న సైనిక ఆధిపత్యం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది.
కూలుతున్న కోటలు: రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, అమెరికా సౌదీ అరేబియా నుండి ఖతార్ వరకు, ఇరాక్ నుండి సిరియా వరకు ఒక భారీ సైనిక నెట్వర్క్ను ఏర్పాటు చేసింది. ఇది కేవలం భూభాగంపై పట్టు కోసమే కాదు, ప్రపంచ రాజకీయాల్లో అమెరికా తన అధికారాన్ని చాటుకోవడానికి ఉపయోగపడింది. అయితే, కేవలం 96 గంటల్లోనే ఈ స్థావరాలు నిర్వీర్యం కావడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
బూడిదైన బిలియన్ డాలర్లు: అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్ము బిలియన్ల కొద్దీ ఈ స్థావరాల కోసం ఖర్చు చేశారు. అత్యాధునిక రాడార్లు, F-35 యుద్ధ విమానాలు, క్షిపణి నిరోధక వ్యవస్థలు అక్కడ మోహరించారు. ఇప్పుడు ఆ స్థావరాలు వదిలివేయబడటం లేదా స్థానిక శక్తుల చేతుల్లోకి వెళ్లడం అగ్రరాజ్యానికి పెద్ద అవమానంగా మారింది.
నష్టాల లెక్క: మధ్యప్రాచ్యంలో అమెరికా గత 70 ఏళ్లలో సుమారు 8 ట్రిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టింది. భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు 740 లక్షల కోట్ల రూపాయలు (1 డాలర్ = ₹92.27 చొప్పున). భారత దేశ వార్షిక బడ్జెట్ కంటే ఇది ఎన్నో రెట్లు ఎక్కువ. ఇరాన్ చేసిన వ్యూహాత్మక కదలికల వల్ల ఈ భారీ సంపద అంతా కేవలం నాలుగు రోజుల్లోనే బుడిదలో పోసిన పన్నీరైంది. ‘ప్రపంచ పోలీస్’ అని చెప్పుకునే అమెరికా ఇప్పుడు తన సొంత స్థావరాలను కూడా కాపాడుకోలేక తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Leave a Reply