హైదరాబాద్కు చెందిన 16 ఏళ్ల బాలుడు పదునైన రేజర్ బ్లేడ్లను మింగడంతో, అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరాడు.
బాలుడి కడుపులో ఉన్న ప్రమాదకరమైన బ్లేడు ముక్కలను సురక్షితంగా బయటకు తీయాల్సిన క్లిష్టమైన సవాలు వైద్యులకు ఎదురైంది.
హైదరాబాద్లోని ఉస్మానియా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వైద్యులు ఆ బాలుడి కడుపులో ఉన్న మూడు రేజర్ బ్లేడు ముక్కలను శస్త్రచికిత్స లేకుండా విజయవంతంగా వెలికితీశారు. ఎక్స్రే (X-ray) పరీక్ష ద్వారా బ్లేడు ముక్కలు పొట్టలో ఉన్నట్లు గుర్తించారు. పేగు భాగంలో గాయాలు కావడం లేదా రంధ్రాలు పడే ప్రమాదం ఉన్నందున, వైద్యులు అత్యంత అప్రమత్తతతో ‘ఎండోస్కోపీ’ ప్రక్రియ ద్వారా వాటిని బయటకు తీశారు.
శరీరానికి పెద్దగా కోత లేకుండా చేసే అధునాతన మైనర్ ప్రొసీజర్ (మినిమల్లీ ఇన్వాసివ్) అయిన ఎండోస్కోపీ ద్వారా బ్లేడ్లను తొలగించడంతో, బాలుడు ప్రమాదం నుంచి బయటపడి వేగంగా కోలుకుంటున్నాడు.

Leave a Reply