బీహార్లోని రక్సౌల్ (Raxaul) ప్రాంతంలో, తన ప్రియుడితో పెళ్లి జరిపించాలంటూ 19 ఏళ్ల యువతి చేసిన హైడ్రామా స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ప్రేమ వ్యవహారంలో కుటుంబ సభ్యుల వ్యతిరేకతను, సమాజ కట్టుబాట్లను వేటినీ లెక్కచేయని ఆ యువతి.. తన పంతం నెగ్గించుకునేందుకు చేతిలో పదునైన కత్తి పట్టుకుని అత్యంత ఎత్తయిన సెల్ టవర్ పైకి ఎక్కింది.
టవర్ పైభాగంలో నిలబడి.. “నాకు ఆ అబ్బాయితో పెళ్లి విషయంపై ఇప్పుడే నిర్ణయం తేలాలి” అంటూ ఆమె మొండిగా కేకలు వేయడం చూసి స్థానికులు హడలిపోయారు. ఈ వార్త క్షణాల్లో వ్యాపించడంతో గ్రామస్తులంతా అక్కడికి భారీగా చేరుకున్నారు. ప్రమాదకర రీతిలో ఉన్న యువతిని చూసి భయాందోళనకు గురైన ప్రజలు, పోలీసులు ఆమెను సురక్షితంగా కిందకు దించేందుకు వివిధ రకాలుగా నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు.
పోలీసుల సుదీర్ఘ చర్చలు, స్థానికుల బుజ్జగింపుల అనంతరం ఆమె కిందకు దిగేందుకు ప్రయత్నించింది. అయితే ఆ సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది; కానీ అదృష్టవశాత్తూ ఆమె తృటిలో ప్రాణాపాయం నుండి బయటపడింది. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని సురక్షిత ప్రాంతానికి తరలించిన పోలీసులు.. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నారు.

Leave a Reply