ఎన్నిక‌ల‌కు ముందే అక్కడ గెలుపు ఖాయం చేసుకున్న వైసీపీ?

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిక‌ల పోరు ఎలా ఉందో అంద‌రికీ తెలిసిందే. వైసీపీ వ‌ర్సెస్ కూట‌మి పార్టీల మ‌ధ్య నిప్పులు చెరుగుకునే రాజ‌కీయం క‌ళ్ల ముందు క‌నిపిస్తోంది. బ‌ల‌మైన అభ్య‌ర్థులు.. బ‌ల‌మైన ప్ర‌చారంతో ఈ రెండు పార్టీలు కూడా.. దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. అయితే.. ఎటొచ్చీ.. రాష్ట్రంలో ప‌రిస్థితి ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని ఆ నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం భిన్న‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అక్కడ ఆ పార్టీ నేత‌ల బ‌ల‌మే ఎక్కువ‌గా ఉంది.

అదే.. చీరాల ఇక్కడ.. గ‌త 2019లో వైసీపీ హ‌వాను త‌ట్టుకుని టీడీపీ కరణం సొంత ఇమేజ్ తో గెలుచుకుంది. ఇక్క‌డ ఉన్న నాయ‌కుడు.. ఒకింత బ‌లంగా ఉన్న నేత‌లేన‌ని స్థానికులు చెబుతున్నారు. చీరాలలో కరణం వెంకటేష్ పోటీలో ఉన్నారు. ఇక‌ ఈ సారి కూడా గెలుపు గుర్రం ఎక్కుతార‌న‌డంలో సందేహం లేద‌ని చెబుతు న్నారు.

కరణం వెంకటేష్ విష‌యాన్ని తీసుకుంటే.. ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావ‌డం.. ప్ర‌జ‌ల‌తోనే ఉండ‌డం.. క‌రోనా స‌మ‌యం లోనూ వారికి అండ‌గా నిలిచిన ప‌రిస్థితి వెంకటేష్ కి ప్ల‌స్ అవుతోంది. అంతేకాదు.. వ్య‌వ‌సాయ ఆధారిత నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ఆయ‌న పోక‌స్ కూడా ఎక్కువ‌గా రైతుల‌పైనే చేశారు. వారికి అండ‌గా ఉన్నారు. ప్ర‌తి విష‌యంలోనూ నేనున్నానంటూ.. ముందుకు వ‌చ్చారు.

దీంతో వెంకటేష్ పై అన్ని వ‌ర్గాల్లోనూ అభిమానం పెరిగింది. పైగా వివాదాల‌కు దూరంగా ఉండ‌డం ఆయ‌న‌కు క‌లిసి వ‌చ్చిన అంశం. అదేవిధంగా స్తానికులు.. పిలిస్తే ప‌లుకుతాడు.. అనే మాట ప్ర‌తి గ‌డ‌ప‌లోనూ వినిపిస్తోంది.మొత్తంగా చూస్తే.. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గెలుపు వీరిదేన‌ని స్థానికంగా వినిపిస్తున్న మాట‌.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *