కొండ ప్రాంతంలో కొంతమంది యువకులు ద్విచక్ర వాహనాలపై విహారయాత్రకు వెళ్లారు. అక్కడ “ఎలుగుబంట్లు తిరుగుతున్నాయి, జాగ్రత్త” అని రాసి ఉన్న హెచ్చరిక బోర్డును గమనించారు. ఆ బోర్డుపై ఉన్న ఎలుగుబంటి బొమ్మను చూసే క్రమంలో, అదుపు తప్పి వాహనం పక్కనే ఉన్న గోతిలో పడిపోయారు.
అదృష్టవశాత్తూ వారికి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. ప్రమాదానికి గల కారణం అడగగా, “మేము ఆ బోర్డుపై ఉన్న ఎలుగుబంటి బొమ్మను చూడటంలో పడి, రోడ్డును గమనించలేదు, అందుకే వాహనం గోతిలో పడిపోయింది” అని వారు సమాధానమిచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “బొమ్మను చూసే గోతిలో పడ్డారు, ఒకవేళ నిజమైన ఎలుగుబంటిని చూస్తే ఏమయ్యేదో!” అని నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.’

Leave a Reply