ఇండోర్: మధ్యప్రదేశ్లోని ఇండోర్, గజ్రానా ప్రాంతంలో కనీసం పునాది రాయి కూడా పడని ఒక ఆసుపత్రికి 87 మంది సిబ్బందిని నియమించి, అడ్మినిస్ట్రేటివ్ పనులు కొనసాగుతుండటం తీవ్ర సంచలనం రేపింది.
నేపథ్యం: సుమారు 3 లక్షల మంది జనాభా ఉన్న ఈ ప్రాంతం కోసం 2020లో 100 పడకల సివిల్ ఆసుపత్రిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, 6 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు భూమి సేకరణ జరగలేదు, కనీసం ఒక్క ఇటుక కూడా పెట్టలేదు.
పాలనా లోపం: నిజానికి ఆసుపత్రి లేకపోయినా, కాగితాలపై మాత్రం వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లతో కలిపి 87 పోస్టులను సృష్టించారు. వీరంతా ఇండోర్లోని ఇతర ఆసుపత్రుల్లో తాత్కాలికంగా పనిచేస్తున్నారు. భూసేకరణలో జాప్యం వల్లే నిర్మాణం మొదలు కాలేదని, ఆన్లైన్ పోర్టల్లో వివరాలు అప్డేట్ కాకపోవడం వల్లే ఇలాంటి బదిలీలు జరుగుతున్నాయని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే, కనీసం భవనం కూడా లేని ఆసుపత్రికి నిరంతరం సిబ్బందిని కేటాయిస్తుండటం పెద్ద అవినీతి అని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది.

Leave a Reply