కాపాడండి..! ఎగసిపడిన మంటలు.. అగ్ని వలయంలో చిక్కుకున్న ఐటీ అధికారులు.. సినిమా స్టైల్‌లో జరిగిన మాస్ రెస్క్యూ..!!

ముంబై చర్చిగేట్ ప్రాంతంలో పనిచేస్తున్న ఆదాయపు పన్ను శాఖ కార్యాలయమైన ‘ఆయ్‌కర్ భవన్’ భవనంలో సోమవారం మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది.

ఏడు అంతస్తుల ఈ భవనంలో బేస్‌మెంట్‌లో మాత్రమే మంటలు వ్యాపించినప్పటికీ, పై అంతస్తుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు బయటకు రాలేక లోపల చిక్కుకుపోయారు. ఈ ప్రమాదానికి కచ్చితమైన కారణం ఇప్పటివరకు తెలియరాలేదు; అయితే అదృష్టవశాత్తూ ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు ధృవీకరించారు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ప్రత్యేక అత్యవసర వాహనాలతో సంఘటనా స్థలానికి చేరుకున్న ముంబై అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలను వేగవంతం చేశారు. వీరిలో ఒక బృందం బేస్‌మెంట్‌లో చెలరేగుతున్న మంటలను పూర్తిగా ఆర్పే పనిలో నిమగ్నం కాగా, మరో బృందం కిటికీల ద్వారా పొడవాటి నిచ్చెనలను ఉపయోగించి పై అంతస్తుల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్ విపత్తు నిర్వహణ విభాగం సమన్వయంతో, సీనియర్ అగ్నిమాపక అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో అక్కడ పూర్తి స్థాయి రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది.


Posted

in

by

Tags: