“కార్పొరేట్ ప్రపంచాన్ని షేక్ చేసిన వైరల్ పోస్ట్”.. ఆఫీసుకెళ్లలేదు.. సిటీని వదిలేశారు.. అయినా నెలకు ₹30,000 ఆదా.. ఇది ఎలా సాధ్యమైంది..?”

బెంగళూరులోని ఒక కార్పొరేట్ సంస్థలో పనిచేసే దంపతులు, తమ నివాసాన్ని హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలికి మార్చుకుని, అక్కడి నుండే ‘రిమోట్ వర్క్’ (Work from home) చేయడం ప్రారంభించారు.

అలా మారిన తర్వాత, ఎటువంటి ప్రత్యేక ప్రణాళికలు లేకుండానే తమకు నెలకు ₹30,000 వరకు డబ్బు ఆదా అవుతోందని వారు సోషల్ మీడియాలో పంచుకున్నారు. బెంగళూరులో ₹45,000 ఉన్న ఇంటి అద్దె, మనాలిలో ₹28,000కి తగ్గడంతో, కేవలం అద్దె రూపంలోనే వారికి ₹17,000 ఆదా అయ్యింది.

అంతేకాకుండా, ఆఫీసుకి ప్రయాణించే ఖర్చు ₹3,000, కాఫీ మరియు స్నాక్స్ ఖర్చులు ₹2,500, ఆఫీసు సంబంధిత డిన్నర్లు లేకపోవడంతో ₹5,000.. ఇలా వివిధ మార్గాల్లో వారి డబ్బు ఆదా అయ్యింది. ఇవన్నీ పక్కన పెడితే, ముఖ్యంగా బెంగళూరు వంటి మహానగరాల్లో పని ఒత్తిడి నుండి బయటపడటానికి వారాంతాల్లో (Weekends) చేసే అనవసరపు ఖర్చులు ₹5,000 నుండి ₹6,000 వరకు మనాలిలో పూర్తిగా తగ్గిపోయాయి.

తాము డబ్బు ఆదా చేయాలనే ఉద్దేశంతో మనాలికి వెళ్లలేదని, తమ జీవనశైలిని మార్చుకోవడానికి మాత్రమే వెళ్లామని, ఈ పొదుపు తమకు అదనపు బోనస్‌గా లభించిందని అంజలి అనే ఆ దంపతుల్లోని భార్య పేర్కొన్నారు. ప్రస్తుతం వీరి అనుభవం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే కంపెనీలు మరియు మనాలిలో ఉన్న హోమ్‌స్టే సౌకర్యాల గురించి నెటిజన్లు ఆసక్తిగా అడుగుతున్నారు.


Posted

in

by

Tags: