ఒడిశా రాష్ట్రంలోని దేన్కనల్ ప్రాంతానికి చెందిన సనాతన్ నాయక్ (29) అనే యువకుడు గత నెల క్రితం అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు.
అతని కోసం వెతుకుతున్న కుటుంబ సభ్యులకు.. సమీపంలోని వరి పొలాల్లో బాగా కుళ్లిపోయిన స్థితిలో ఒక యువకుడి మృతదేహం లభ్యమైన సమాచారం అందింది.
ఆ శవంపై ఉన్న దుస్తులను చూసి, అది సనాతన్ నాయక్దేనని అతని తల్లిదండ్రులు పొరపాటుగా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దహన సంస్కారాలు పూర్తి చేశారు. అంతేకాకుండా, ఆచారాల ప్రకారం 16వ రోజు కర్మకాండలు (శుద్ధిక్రియ) కూడా జరిపించి తీరని దుఃఖంలో మునిగిపోయారు.
ఈ తరుణంలో, తప్పిపోయిన నెల రోజుల తర్వాత సనాతన్ నాయక్ అకస్మాత్తుగా ప్రాణాలతో ఇంటికి తిరిగి వచ్చాడు. అతన్ని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి, ఆశ్చర్యానికి గురైన కుటుంబ సభ్యులు కన్నీళ్లతో స్వాగతం పలికారు. అయితే, అప్పట్లో దహనం చేసిన ఆ గుర్తుతెలియని మృతదేహం ఎవరిది అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply