“దయచేసి బంగారం కొనకండి!”. ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ విడుదల చేసిన వీడియో.. దీని వెనుక ఉన్న రహస్యం ఇదే.!!

దేశ ఆర్థిక వృద్ధిని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో, అత్యవసరమైతే తప్ప బంగారంలో పెట్టుబడులు పెట్టడం, విదేశాల్లో వివాహాలు చేసుకోవడం, విదేశీ పర్యటనలకు వెళ్లడం వంటి వాటిని తగ్గించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను నిరంతరం కోరుతున్నారు.

భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 7.8 శాతం వృద్ధిని నమోదు చేసుకున్న నేపథ్యంలో, ఈ పురోగతిని మరింత స్థిరీకరించేందుకు స్వదేశీ వస్తువులను పెద్ద ఎత్తున ఉపయోగించాలని తన తాజా సోషల్ మీడియా పోస్టులోనూ ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

ప్రధాని చేసిన ఈ విజ్ఞప్తి ఫలితంగా నేటి స్టాక్ మార్కెట్లో ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థల షేర్లు గణనీయమైన నష్టాలను చవిచూశాయి. మదుపర్లలో నెలకొన్న ఆందోళనల కారణంగా కల్యాణ్ జ్యువెలర్స్ షేర్లు 4.8 శాతం, టైటాన్ కంపెనీ షేర్లు 1.3 శాతం, తంగమయిల్ జ్యువెలరీ షేర్లు 1.7 శాతం మేర నష్టపోయి ట్రేడయ్యాయి.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *