ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీ ప్రాంతంలో పెళ్లయిన కేవలం ఒకటిన్నర నెలలకే ఓ నవవధువు తన ప్రియుడితో కలిసి ఆడిన కపట నాటకం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
గత జూన్ 24వ తేదీన హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరగ్గా, పెళ్లయిన కొన్ని రోజులకే భార్య ప్రవర్తనపై భర్తకు తీవ్ర అనుమానం వచ్చింది. ఈ క్రమంలో ఒకరోజు ఆమెను తన ప్రియుడితో కలిసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు.
బాధిత భర్త పోలీసు ఉన్నతాధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో తన భార్య తనను నిరంతరం మోసం చేస్తూ వచ్చిందని పేర్కొన్నాడు. రాత్రి వేళల్లో తను మేల్కొని ఉండకుండా ఉండేందుకు తాను తాగే పాలు, టీ మరియు ఆహారంలో క్రమం తప్పకుండా నిద్రమాత్రలు కలిపి ఇచ్చేదని ఆరోపించాడు.
భర్త మత్తులో జోగుతుండగా ప్రియుడితో కలిసి ఏకాంతంగా గడిపేదని, ఈ బాగోతాన్ని అనుకోకుండా భర్త రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడంతో అతడిని అంతమొందించేందుకు వారు ప్రయత్నించారని విచారణలో వెల్లడైంది.
ఇంట్లో ఇద్దరినీ చూసి భర్త నిలదీసిన సమయంలో భార్య అతని చేతులను గట్టిగా పట్టుకోగా, ప్రియుడు అతని గొంతు నులిమి చంపేందుకు యత్నించాడు. అయితే భర్త కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వెంటనే అక్కడికి చేరుకుని జోక్యం చేసుకోవడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు; ఈ కిలాడీ భార్య కుట్ర సోషల్ మీడియాలో నెటిజన్లను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

Leave a Reply