ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన మార్కెట్లో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో, వాషింగ్టన్ మరియు న్యూఢిల్లీ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం సముద్రంలో చిక్కుకుపోయిన రష్యా ముడి చమురును కొనుగోలు చేసేందుకు భారతీయ రిఫైనరీ కంపెనీలకు అమెరికా 30 రోజుల ప్రత్యేక ‘వేవర్’ (మినహాయింపు) మంజూరు చేసింది.
- అమెరికా ప్రకటన: ప్రపంచ మార్కెట్లో చమురు సరఫరాకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బేసెంట్ తెలిపారు. ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని, దీనివల్ల రష్యాకు పెద్దగా ఆర్థిక ప్రయోజనం ఉండదని, ఎందుకంటే ఇప్పటికే రవాణాలో ఉన్న చమురుకు మాత్రమే ఇది వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
- భారత్కు ఎందుకు అవసరం?: భారత్ తన అవసరాలకు కావాల్సిన 40% చమురును మధ్యప్రాచ్యం నుండి హార్ముజ్ జలసంధి ద్వారా దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుతం ఆ ప్రాంతం యుద్ధ క్షేత్రంగా మారడంతో సరఫరాకు అంతరాయం కలిగింది. భారత్ వద్ద కేవలం 25 రోజులకు సరిపడా చమురు నిల్వలు మాత్రమే ఉండటంతో, రష్యా చమురు భారత్కు అత్యవసరంగా మారింది.
- యుద్ధ పరిస్థితి: మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్రరూపం దాల్చింది. అమెరికా తన రాయబార కార్యాలయాన్ని కువైట్లో మూసివేసింది. రష్యా చమురును కొనుగోలు చేసేందుకు ఇండియన్ ఆయిల్ (IOC), భారత్ పెట్రోలియం (BPCL) వంటి సంస్థలు చర్చలు జరుపుతున్నాయి.

Leave a Reply