తిరువనంతపురం: మహిళలను లైంగికంగా మోసగించి, వారి వ్యక్తిగత క్షణాలను రహస్యంగా చిత్రీకరించిన ఒక కిరాణా దుకాణం యజమాని అరెస్ట్ అయిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
ప్రముఖ మీడియా సంస్థ ‘కౌముది ఆన్లైన్’ ప్రచురించిన కథనం ప్రకారం.. నిందితుడు తన మాయమాటలతో దాదాపు 25 మంది మహిళలను వలగించి, వారితో లైంగిక సంబంధాలు పెట్టుకున్నాడు.
అంతటితో ఆగకుండా, ఆ మహిళలకు తెలియకుండానే వారి అత్యంత వ్యక్తిగత, అంతరంగిక క్షణాలను తన మొబైల్ ఫోన్లో రహస్యంగా రికార్డ్ చేశాడు. బాధితుల నుండి అందిన ఫిర్యాదుల ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు తీవ్రంగా దర్యాప్తు జరిపి, సదరు కిరాణా దుకాణం యజమానిని బేడీలు వేశారు.
అరెస్ట్ చేసిన నిందితుడి వద్ద నుండి మొబైల్ ఫోన్లు, రహస్య కెమెరాలతో కూడిన డిజిటల్ ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహిళల బలహీనతలను ఆసరాగా చేసుకుని, వారిని బ్లాక్మెయిల్ చేయడానికి కూడా ఈ వీడియోలను అతను ఉపయోగించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘోర ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించగా.. సోషల్ మీడియా మరియు డిజిటల్ పరికరాల ద్వారా జరిగే ఇటువంటి మోసాల పట్ల మహిళలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ఈ కేసులో ఇంకా ఎవరికైనా ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం లోతైన విచారణ జరుపుతున్నారు.

Leave a Reply