వేమూరు రాజకీయం ఆసక్తి కరంగా మారింది. గెలుపు కోసం….ఇటు టీడీపీ, అటు వైసీపీకి రెండు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అయితే కలిసొచ్చేదెవరికి, అని చూస్తే, ఇక్కడ సామాజిక సమకరణాలు కీలకంగా మారాయి. టీడీపీ, జనసేన పొత్తతో లెక్కలు మారిపోయాయి. నువ్వా నేనా అన్నట్లుగా హోరా హోరీగా పోటీ అయితే కొనసాగుతోంది. తొలి నుంచి సామాజిక వర్గాలే ఇక్కడ గెలుపు ఓటములను ప్రభావితం చేస్తున్నాయి.
టీడీపీ నుంచి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పోటీలో ఉన్నారు. టీడీపీ, జనసేన పొత్తుతో ఈ నియోజకవర్గం పైన టీడీపీ ఆశలు పెట్టుకుంది. అయితే, వైసిపి అభ్యర్ధి వరకూటి అశోక్ బాబు విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. ఎస్సీ, బీసీ వర్గాలు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో రెండు పార్టీలు ఓటర్ల ను ప్రభావితం చేస్తున్నారు. సీఎం జగన్ ఈ నియోజకవర్గంలో గెలుపు బాధ్యతలు పూర్తిగా పార్టీ అభ్యర్ది అశోక్ బాబు పైనే వదిలేసారు. దీంతో, వేమూరు నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణాలతో గెలుపు వైసిపి వైపు ఉంటుందని రాజకీయ పరశీలుకుల అంచనా.
జాతీయ సంస్థలు వేమూరులో నిర్వహించిన సర్వేలో 46 శాతం ఓటర్లు వైసీపీకి అనుకూలంగానూ, టీడీపీ కేవలం 41 శాతం ఓటర్లు అనుకూలంగా మాట్లాడారు. అయితే జగన్ పాలన ఎలా వుందనే ప్రశ్నకు వేమూరు ఓటర్లు స్పందిస్తూ బాగానే వుందని 59 శాతం, అస్సలు బాగాలేదని 32 శాతం ఓటర్లు స్పందించారు.
Leave a Reply