దర్శకుడు అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ నటి రాశీ ఖన్నా, షూటింగ్ సెట్స్ అనుభవాల గురించి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఆమె తన పోస్ట్లో.. “మా డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు చాలా స్ట్రిక్ట్; అందుకే నా డైలాగ్స్ అన్నీ ముందే బాగా బట్టీ పట్టి, షూటింగ్కు ఫుల్ ప్రిపేర్డ్గా వచ్చాను” అంటూ సరదాగా పేర్కొన్నారు. రాశీ ఖన్నా పెట్టిన ఈ పోస్ట్ను చూసిన దర్శకుడు అశ్వత్ మారిముత్తు వెంటనే స్పందిస్తూ.. “నా హీరోయిన్ కూడా అద్భుతంగా సిద్ధమైంది” అంటూ ఆమె డెడికేషన్ను ప్రశంసిస్తూ రిప్లై ఇచ్చారు.
వీరిద్దరి మధ్య సాగిన ఈ సరదా ఇన్స్టాగ్రామ్ సంభాషణ, కామెంట్లు ప్రస్తుతం రజనీ ఫ్యాన్స్తో పాటు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతున్నాయి. అశ్వత్ మారిముత్తు – రజనీకాంత్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ అత్యంత క్రమశిక్షణతో, పక్కా ప్లానింగ్తో జరుగుతోందని ఈ పోస్ట్ల ద్వారా తెలుస్తోందంటూ సినీ ప్రముఖులు, అభిమానులు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Leave a Reply