మిడిల్ ఈస్ట్లో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం భూమిపైన మాత్రమే కాదు, ఆకాశంలో కూడా భయాందోళనలు సృష్టిస్తోంది. ఈ ఉద్రిక్తతల మధ్య వియన్నా నుండి న్యూఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్లలో ఈ విమానం ప్రయాణించిన తీరు చూసి నెటిజన్ల గుండె ఆగిపోయినంత పని అయింది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన అంశం:
ఒక కంటెంట్ క్రియేటర్ వీడియో షేర్ చేస్తూ.. మిగతా విమానయాన సంస్థలు యుద్ధ ప్రాంతాల నుండి తప్పించుకుంటుంటే, ఎయిర్ ఇండియా పైలట్లు మాత్రం ‘ఖత్రోం కే ఖిలాడీ’లా ప్రమాదకరమైన ప్రాంతాల్లో విమానాన్ని రౌండ్లు కొట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘ఫ్లైట్ అవేర్’ (FlightAware) రాడార్ డేటా ప్రకారం, ఆ విమానం దుబాయ్ సమీపంలోని సున్నితమైన ఎయిర్స్పేస్లో నాలుగు సార్లు చుట్టూ తిరిగినట్లు కనిపించింది. క్షిపణి దాడుల అలర్ట్ ఉన్న సమయంలో ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని చాలామంది విమర్శలు గుప్పించారు.
పైలట్ ఓజస్విని అరోరా వెల్లడించిన అసలు నిజం:
ఈ విమర్శలు తీవ్రమవ్వడంతో ఆ విమాన ప్రధాన పైలట్ ఓజస్విని అరోరా స్వయంగా స్పందించారు. రాడార్లో కనిపించినవన్నీ అబద్ధాలని ఆమె తేల్చి చెప్పారు.
- టెక్నికల్ గ్లిచ్: విమానం అసలు యూఏఈ (UAE) లేదా ఇతర నిషేధిత ప్రాంతాల్లోకి ప్రవేశించలేదని ఆమె స్పష్టం చేశారు.
- GPS స్పూఫింగ్: యుద్ధ ప్రాంతాల్లో తరచుగా ‘జీపీఎస్ స్పూఫింగ్’ లేదా సిగ్నల్ సమస్యలు ఉంటాయి. దీనివల్ల రాడార్పై విమానం తప్పుడు దిశలో వెళ్తున్నట్లు లేదా చుట్టూ తిరుగుతున్నట్లు (Ghost Loops) కనిపిస్తుంది. భూమిపై ఉన్నవారికి రాడార్లో విమానం తప్పుగా కనిపించినా, పైలట్లకు మాత్రం సరైన సమాచారం అందుతుందని ఆమె వివరించారు.

Leave a Reply