ఐదుగురు పిల్లల తండ్రి అయిన జోష్ కొలెట్ (Josh Collette), కాలిఫోర్నియాలోని ‘శాంటా క్లెమెంటే’ రివేరా బీచ్లో ఉధృతమైన రాకాసి అలల సుడిగుండంలో చిక్కుకున్న ఇద్దరు పిల్లలను కాపాడేందుకు ప్రాణాలకు తెగించి సముద్రంలోకి దూకాడు.
ఈత కొట్టడం, సర్ఫింగ్ చేయడంలో ఎంతో నైపుణ్యం ఉన్న జోష్.. సముద్రంలోకి దూకిన సమయంలో దురదృష్టవశాత్తూ నీటి అడుగున ఉన్న ఇసుక తిన్నెలను (Sandbar) అతని తల బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతని మెడలోని 2 ఎముకలు విరిగిపోవడంతో పాటు వెన్నుపాముకు తీవ్ర గాయమైంది. దీంతో శరీరం చచ్చుబడి (పక్షవాతం వచ్చి) ప్రస్తుతం అతడు తీవ్ర చికిత్స విభాగం (ICU) లో ప్రాణాలతో పోరాడుతున్నాడు. అతను మాట్లాడలేని స్థితిలో ఉండటంతో, అతని భార్య రోజ్ అతని పెదవుల కదలికలను అర్థం చేసుకుంటూ ఇతరులతో మాట్లాడుతోంది.
మెరుగైన ప్రత్యేక చికిత్స కోసం అతడిని కొలరాడోలోని ఆసుపత్రికి తరలించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించగా, ఆన్లైన్ ద్వారా క్రౌడ్ఫండింగ్ రూపంలో ఇప్పటివరకు 2,04,000 డాలర్లకు (సుమారు ₹1.7 కోట్ల పైనే) పైగా విరాళాలు సమకూరాయి. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పిల్లలను కాపాడేందుకు ప్రయత్నించిన అతని నిస్వార్థ త్యాగాన్ని నెటిజన్లు, ప్రజలు ఎంతగానో కొనియాడుతున్నారు.

Leave a Reply