పశ్చిమ బెంగాల్లోని హూగ్లీ జిల్లా రిష్రా ప్రాంతంలో ఒక భర్త తన భార్యను హత్య చేసి, ఆ తర్వాత తనే ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఏమి జరిగింది? దీపాంకర్ సర్కార్ (39) మరియు మోనికా సర్కార్ (31) దంపతులకు 7 ఏళ్ల కుమార్తె ఉంది. వీరి మధ్య కొంతకాలంగా కుటుంబ గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి కూడా వారిద్దరి మధ్య తీవ్ర వాదన జరిగింది. శనివారం తెల్లవారుజామున ఆవేశంలో దీపాంకర్, కత్తితో భార్య గొంతు కోసి చంపేశాడు. దారుణం ఏమిటంటే, తల్లి మృతదేహం పక్కనే 7 ఏళ్ల చిన్నారి ఏమీ తెలియనట్లు నిద్రపోతోంది. ఉదయం పనిమనిషి వచ్చి చూసి కేకలు వేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు అక్కడికి చేరుకుని పాపను సురక్షితంగా అమ్మమ్మ ఇంటికి పంపించారు.
20 కి.మీ పరుగెత్తి.. భార్యను చంపిన తర్వాత దీపాంకర్ అక్కడ నుండి తప్పించుకుని, సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోల్కతా నగరానికి వెళ్లాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో బెల్గాచియా మెట్రో రైల్వే స్టేషన్కు చేరుకుని, పట్టాలపై దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనివల్ల మెట్రో రైలు సేవలు 50 నిమిషాల పాటు నిలిచిపోయాయి.
పోలీసుల విచారణ: దీపాంకర్ తన భార్యను ఎందుకు చంపాడనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీపాంకర్కు మరొక మహిళతో సంబంధం ఉందని, ఆ విషయాన్ని మోనికా ప్రశ్నించడమే గొడవకు కారణమని స్థానికులు చెబుతుంటే, దీపాంకర్కు తన భార్యపై అనుమానం ఉండటమే హత్యకు కారణమని బంధువులు పేర్కొంటున్నారు. ఈ కోణంలో శ్రీరాంపూర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
