ఉత్తరప్రదేశ్, మొరాదాబాద్: ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ నుండి ఒక హృదయ విదారకమైన ఘటన వెలుగులోకి వచ్చింది. 22 ఏళ్ల యువతి తన కుటుంబ గౌరవాన్ని, సమాజం గురించి ఏమాత్రం పట్టించుకోకుండా తన మేనమామ కొడుకుతో కలిసి పారిపోయి పెళ్లి చేసుకుంది.
ఈ ఘటనతో కుటుంబం తీవ్ర షాక్కు గురైంది. తన కుమార్తె ఇలాంటి పని చేసిందని, ఇంట్లో ఉన్న సుమారు రూ. 25 లక్షల విలువైన నగలను కూడా తీసుకుని వెళ్లిపోయిందని తెలిసి ఆ తండ్రి కుప్పకూలిపోయారు.
తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య: ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. కూతురు చేసిన పనికి సమాజంలో ఎదురైన అవమానాన్ని, పరువు నష్టాన్ని ఆ తండ్రి భరించలేకపోయాడు. కూలీగా పనిచేస్తూ కష్టపడి బతికే ఆ తండ్రికి తన కుమార్తె చేసిన ఈ పని తీవ్రమైన మానసిక వేదనను మిగిల్చింది. సమాజం ముందు తలెత్తుకోలేక, ఆ వేదనను తట్టుకోలేక అతను విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు.
కుటుంబ సభ్యులు, బంధువులు ఎంత ఓదార్చినా, జరిగిన అవమానం నుండి ఆయన బయటపడలేకపోయారు. కూతురి చర్య వల్ల కుటుంబానికి జరిగిన నష్టం, సమాజంలో కలిగిన అప్రతిష్ట ఆయనను మృత్యువు వైపు నడిపించాయి. ఈ ఘటన స్థానికంగా విషాదఛాయలను నింపింది. కుటుంబ విలువలను, అనుబంధాలను పూర్తిగా నాశనం చేసిన ఈ ఘటన, ఆ ప్రాంత వాసులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
