“రేపు నేను వచ్చేసరికి నువ్వు ఇక్కడ ఉండకూడదు..”. “వ్యాపారిని బెదిరించిన ఆటో డ్రైవర్”. కూరగాయలను చూడగానే తలకెక్కిన కసి. నడిరోడ్డుపై విచక్షణారహితంగా నరికివేత. కలకలం రేపిన వీడియో..!!

మహారాష్ట్రలోని పింప్రి-చించ్వాడ్ ప్రాంతంలో ఒక స్వీట్ షాప్ సమీపంలో నిన్న మొన్నటి ఉదయం కూరగాయలు విక్రయిస్తున్న ఖాన్ (26) అనే వ్యాపారిపై అదే ప్రాంతంలో ఆటో నడుపే మరొక వ్యక్తి అత్యంత దారుణంగా దాడికి పాల్పడ్డాడు.

బాధితుడైన వ్యాపారి, ఆ ఆటో డ్రైవర్ ఇద్దరూ ఒకే చోట కూరగాయల వ్యాపారం చేస్తుండటంతో, ఇద్దరి మధ్య వ్యాపారానికి సంబంధించి పాత కక్షలు ఉన్నాయి. ముఖ్యంగా, తన షాప్ సమీపంలో కూరగాయలు అమ్మకూడదని క్రితం రోజే ఆ ఆటో డ్రైవర్ ఖాన్‌ను బెదిరించినప్పటికీ, అతడు దాన్ని పట్టించుకోకుండా ఎప్పటిలాగే వ్యాపారం చేసుకుంటున్నాడు.

దీంతో ఆగ్రహించిన ఆటో డ్రైవర్, గత బుధవారం ఉదయం ఒక్కసారిగా అక్కడికి వచ్చి తీవ్రంగా గొడవపడి, తన వద్ద దాచి ఉంచిన పదునైన ఆయుధంతో ఖాన్‌ను నరికివేసి అక్కడి నుండి పరారయ్యాడు. రక్తమడుగులో పడిపోయి ప్రాణాలతో పోరాడుతున్న ఆ యువకుడిని చూసి దిగ్భ్రాంతి చెందిన చుట్టుపక్కల వారు, వెంటనే అతడిని రక్షించి సమీపంలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ అతనికి అత్యవసర చికిత్స అందిస్తుండగా, అతని ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి.

ఈ దారుణ ఉన్మాద చర్య ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయి, ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ సంఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పింప్రి పోలీసులు సీసీటీవీ దృశ్యాలను తీవ్రంగా పరిశీలిస్తున్నారు. పరారీలో ఉన్న ఆటో డ్రైవర్ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు తీవ్రంగా గాలిస్తుండగా, పగటిపూట జరిగిన ఈ దారుణ దాడి ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనాన్ని, భయాందోళనలను రేకెత్తించింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *