బీహార్లో ఒక యువతికి ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం జరిగింది. ఆ వివాహం ఆమెకు ఇష్టం లేకపోవడంతో, అవకాశం దొరికిన వెంటనే తన ప్రియుడితో కలిసి ఇంటి నుండి పారిపోయింది. అంతటితో ఆగకుండా, కదులుతున్న రైలులోనే తన ప్రియుడిని వివాహం చేసుకుంది.
ఈ ఘటన బీహార్లోని సుల్తాన్గంజ్, భీర్ఖుర్ద్ పంచాయతీలో చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం, ఆ యువతికి రెండు నెలల క్రితమే పెళ్లయింది, కానీ ఆమె మరొకరిని ప్రేమిస్తున్నందున ఆ బంధంతో సంతోషంగా లేదు. కుటుంబ సభ్యులు బలవంతంగా వివాహం చేసినప్పటికీ, ఆమె ప్రేమ తగ్గలేదు.
ప్రియుడితో కలిసి పారిపోవాలని ప్లాన్ వేసిన యువతి, బుధవారం మార్కెట్కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి బయటకు వచ్చింది. ఆ తర్వాత, తన ప్రియుడితో కలిసి రైలులో ప్రయాణిస్తున్నప్పుడు వివాహం చేసుకుంది. తోటి ప్రయాణికుల సమక్షంలో యువతి తన ప్రియుడితో, “నా నుదుట సింధూరం దిద్దు, నీ కలను నిజం చేసుకో” అని చెప్పింది. ఆమె మాట మేరకు ప్రియుడు ఆమె నుదుట సింధూరం దిద్ది, జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేశాడు. ఈ వింత వివాహానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
