వియత్నాంలోని ప్రసిద్ధ ‘హనోయి రైల్వే స్ట్రీట్’లో, కొంతమంది భారతీయ పర్యాటకులు రైల్వే పట్టాలపై నిలబడి ‘చయ్యా చయ్యా’ పాటకు గ్రూప్ డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇతర దేశాల పర్యాటకులు అక్కడ ప్రశాంతంగా ఆ ప్రాంతాన్ని ఆస్వాదిస్తుండగా, మన దేశానికి చెందిన వారు కెమెరా ముందు రీల్స్ చేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “విదేశాలకు వెళ్ళినప్పుడు ఎందుకు ఇలా ‘షో-ఆఫ్’ చేయాల్సి వస్తుంది?” అని నెటిజన్లు వారిని కఠినంగా విమర్శిస్తున్నారు.
ఇంటర్నెట్లో చర్చ: ఈ వీడియోపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. “ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం భారతీయులు అనవసరంగా ఇలా అనాగరికంగా ప్రవర్తిస్తున్నారు” అని ఒక వర్గం విమర్శించగా, “వారు ఎవరికీ ఇబ్బంది కలగకుండా తమ సెలవులను సరదాగా జరుపుకుంటున్నారు, ఇందులో తప్పేముంది?” అని మరో వర్గం వాదిస్తోంది. దీంతో ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
