కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ (Thrissur) లో తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడుతున్న ఒక మహిళను, ఆమె కుటుంబ సభ్యులు సమీపంలోని ఒక నకిలీ నాటు వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు.
ఆ నకిలీ వైద్యుడు ఆ మహిళ ఛాతీపై కర్రతో కొడుతూ, గట్టిగా వేగంగా శ్వాస తీసుకోమంటూ దాదాపు అరగంటకు పైగా చిత్రహింసలకు గురిచేశాడు. “సాయంత్రానికల్లా నొప్పి తగ్గిపోతుందిలే” అని చెప్పి వారిని ఇంటికి పంపించేశాడు.
ఇంటికి చేరుకోగానే ఆ మహిళ స్పృహతప్పి పడిపోవడంతో, తీవ్ర భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు.. “మరో గంట ఆలస్యమై ఉంటే ఈమె ప్రాణాలను కాపాడటం అసాధ్యమయ్యేది” అని చెబుతూ అత్యవసర వైద్య చికిత్స అందించి ప్రాణాలను కాపాడారు. నకిలీ వైద్యుడు చేసిన ఘాతుకాన్ని తెలుసుకున్న వైద్యులు.. ఛాతీ నొప్పి (గుండెపోటు లక్షణాలు) వంటి అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటి నకిలీ వైద్యులను, మూఢనమ్మకాలను నమ్మి ప్రాణాలతో చెలగాటమాడవద్దని ప్రజలను గట్టిగా హెచ్చరించారు.

Leave a Reply