వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భార్యను దారుణంగా హత్య చేసి, దాన్ని వీడియోగా రికార్డు చేసి భార్య తల్లిదండ్రులకు పంపిన షాకింగ్ ఘటన తీవ్ర కలకలాన్ని రేపింది.
ఈ ఘటనకు పాల్పడిన భర్త ప్రవీణ్ను పోలీసులు వెంటనే అరెస్టు చేశారు.
హత్యకు గురైన భాగ్యశ్రీ (23), ఆమె భర్త ప్రవీణ్ మధ్య గత కొన్ని నెలలుగా కుటుంబ సమస్యలు నడుస్తున్నాయి. దీని కారణంగా అలకబూని వెళ్లిన భాగ్యశ్రీ, గత రెండు నెలలుగా తన తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటోంది.
ఈ క్రమంలో భార్యను సర్దిచెప్పి మళ్లీ తీసుకెళ్లడానికి ప్రవీణ్ అక్కడికి వెళ్లాడు. ఇకపై ఎలాంటి సమస్యలు లేకుండా శాంతియుతంగా జీవిద్దామని ఆశ చూపించి తన భార్యను తీసుకొచ్చాడు. కానీ తీసుకొచ్చిన అదే రోజు సాయంత్రమే భార్యను దారుణంగా హత్య చేశాడు.
హత్య చేయడమే కాకుండా, దాన్ని తన మొబైల్ ఫోన్లో వీడియోగా రికార్డు చేసి భాగ్యశ్రీ తల్లిదండ్రులకు పంపించాడు. ఇది చూసి దిగ్భ్రాంతి చెందిన తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, దారుణానికి ఒడిగట్టిన భర్త ప్రవీణ్ను అరెస్టు చేసి తీవ్రంగా విచారిస్తున్నారు.

Leave a Reply