అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికైన రికార్డు భారత మాజీ బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ పేరిట నమోదైంది. అంతర్జాతీయ క్రికెట్లో టెండూల్కర్ మొత్తం 76 సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును గెలుచుకున్నాడు.
భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులను అందుకున్నాడు. టెండూల్కర్ అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టు తరఫున మొత్తం 664 మ్యాచ్లు ఆడాడు. కాగా, అతను 76 సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు. సచిన్ టెస్టుల్లో 14 సార్లు, వన్డేల్లో 62 సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును గెలుచుకున్నాడు.
ప్రస్తుతం టీమిండియా గ్రేట్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీ తన క్రికెట్ కెరీర్లో 63 సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును గెలుచుకున్నాడు. టెస్టు క్రికెట్లో 10 సార్లు, వన్డేల్లో 38 సార్లు, టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 15 సార్లు కోహ్లీ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
శ్రీలంక మాజీ బ్యాట్స్మెన్ సనత్ జయసూర్య మూడో స్థానంలో నిలిచాడు. జయసూర్య తన కెరీర్లో శ్రీలంక తరఫున 586 మ్యాచ్లు ఆడాడు. కాగా, అతను 58 సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు. టెస్టు క్రికెట్లో నాలుగుసార్లు, వన్డేల్లో 48, టీ20 అంతర్జాతీయ క్రికెట్లో ఆరుసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా జయసూర్య ఎంపికయ్యాడు.
ఆఫ్రికా మాజీ వెటరన్ ఆల్ రౌండర్ జాక్వెస్ కల్లిస్ నాలుగో స్థానంలో ఉన్నాడు. కల్లిస్ 519 మ్యాచ్ల్లో 57 సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో 23 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు, వన్డేల్లో 32, అంతర్జాతీయ టీ20 క్రికెట్లో రెండుసార్లు కల్లీస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు.
శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర ఐదో స్థానంలో ఉన్నాడు. సంగక్కర అంతర్జాతీయ క్రికెట్లో 50 సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును గెలుచుకున్నాడు. టెస్టు క్రికెట్లో 16 సార్లు, వన్డేల్లో 31 సార్లు, టీ20 అంతర్జాతీయ క్రికెట్లో మూడుసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు.
