రియాద్: అమెరికా, ఇజ్రాయెల్లతో జరుగుతున్న యుద్ధంలో భాగంగా ఇరాన్ ఇప్పుడు అరబ్ దేశాలను లక్ష్యంగా చేసుకుంటోంది. ముఖ్యంగా సౌదీ అరేబియాపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఇప్పటివరకు సౌదీ అరేబియా ఎదురుదాడి చేయనప్పటికీ, ఇరాన్ తన ‘రెడ్ లైన్’ (హద్దులు) దాటడంతో సౌదీ అరేబియా ఇకపై అమెరికా, ఇజ్రాయెల్లతో కలిసి ఇరాన్పై దాడికి సిద్ధమవుతున్నట్లు దిగ్భ్రాంతికరమైన సమాచారం అందుతోంది.
ప్రధానాంశాలు:
- ఆర్థిక వ్యవస్థపై దెబ్బ: సౌదీ అరేబియాకు చెందిన అతిపెద్ద చమురు సంస్థ ‘సౌదీ అరామ్కో’పై ఇరాన్ దాడులు చేసింది. అంతేకాకుండా, హార్ముజ్ జలసంధిని మూసివేస్తామని ప్రకటించడం ద్వారా సౌదీ చమురు వాణిజ్యానికి అడ్డుకట్ట వేసింది.
- తాగునీటిపై ముప్పు: సౌదీ అరేబియాలోని 75% ప్రజలు సముద్రపు నీటిని శుద్ధి చేసే ప్లాంట్ల (Desalination plants) పైనే ఆధారపడతారు. రాజధాని రియాద్ ప్రజలకు ఇది ప్రధాన వనరు. ఈ ప్లాంట్లపై ఇరాన్ దాడి చేసే అవకాశం ఉందని సౌదీ ఆందోళన చెందుతోంది.
- రెడ్ లైన్ దాటిన ఇరాన్: చమురు నిలయాలు, తాగునీటి శుద్ధి కేంద్రాలు మరియు వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఇరాన్ సౌదీ అరేబియా సహనాన్ని పరీక్షిస్తోంది. ఇది ప్రజల జీవనోపాధిని, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోంది.
- యుద్ధంలోకి సౌదీ ఎంట్రీ: ప్రశాంతతను కోరుకునే సౌదీ అరేబియా ఇప్పుడు యుద్ధం వైపు మొగ్గు చూపుతోంది. ఒకవేళ సౌదీ గనుక యుద్ధంలోకి దిగితే, మధ్యప్రాచ్యంలో ఇది పెను యుద్ధానికి దారితీస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
నిపుణుల విశ్లేషణ:
ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ బెర్నార్డ్ హైకెల్ ప్రకారం, “సౌదీ అరేబియా ఇప్పటికే ఇరాన్కు హెచ్చరిక సందేశాలు పంపింది. తమ మౌలిక సదుపాయాలపై దాడులు చేయవద్దని కోరింది. కానీ ఇరాన్ ఆ వినతిని తోసిపుచ్చింది.”
అయితే, అమెరికాలోని సౌదీ మాజీ రాయబారి మైఖేల్ రాట్నీ ప్రకారం.. సౌదీ అరేబియా చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే యుద్ధం జరిగితే సౌదీ ప్రతిష్టాత్మకమైన ‘విజన్ 2030’ పథకాలు దెబ్బతినే అవకాశం ఉంది.

Leave a Reply