హాసన్ ఎంపీ హెచ్డీ రేవణ్ణ తనయుడు ప్రజ్వల్ రేవణ్ణకు చెందిన అసభ్యకర వీడియో వైరల్ అవుతుండటంతో మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి కొత్త బాంబు పేల్చారు. సీఎం సిద్ధరామయ్యపై విరుచుకుపడిన ఆయన తన కుమారుడు రాకేష్ సిద్ధరామయ్య మరణ రహస్యాన్ని కూడా బయటపెడతానని ప్రకటించారు.
హుబ్లీలో మీడియాతో మాట్లాడిన హెచ్డీకే.. సిద్ధరామయ్య ఇంట్లో జరిగిన విషయాన్ని బయటపెడతాను. రాకేష్ సిద్ధరామయ్య మృతి అంశాన్ని తెరపైకి తెస్తానని చెప్పారు.
సిద్ధరామయ్య కుటుంబానికి ప్రధాని నరేంద్ర మోదీ ఎలా సాయం చేశారో మీరు మర్చిపోయారు. మేము అన్ని పత్రాలను బయటకు తీసుకువస్తాము. మీ కుటుంబంలో ఏం జరిగినా బయటకు వస్తుంది.
Leave a Reply