“16 ఏళ్ల వయస్సులో కిడ్నాప్.. నకిలీ పత్రాలతో బలవంతపు పెళ్లి.” 6 ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజం.. నాగ్‌పూర్‌లో జరిగిన ఘోరం.!!

మహారాష్ట్ర రాష్ట్రం నాగ్‌పూర్‌లో, 2020లో 16 ఏళ్ల వయస్సు ఉన్న ఒక బాలికను సమీర్ అలీ అనే యువకుడు అపహరించి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆ తర్వాత, ఆ బాలిక పేరు మరియు వయస్సు మార్చి నకిలీ ప్రభుత్వ గుర్తింపు కార్డును తయారుచేసి, 2021లో తన కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమెను బలవంతంగా వివాహం చేసుకున్నాడు. ఈ చట్టవిరుద్ధమైన వివాహం ద్వారా ఆ మహిళ ప్రస్తుతం నాలుగు సంవత్సరాల బిడ్డకు తల్లి అయింది.

బాధితురాలు ఆరు సంవత్సరాల తర్వాత పోలీసులను ఆశ్రయించి, తాను అనుభవించిన శారీరక, మానసిక వేధింపుల గురించి ఫిర్యాదు చేసింది. నకిలీ పత్రాల తయారీ, బలవంతపు మతమార్పిడి కుట్ర, కిడ్నాప్, బాల్యవివాహం మరియు పోక్సో సహా పలు చట్టపరమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, దీనిపై తీవ్రంగా విచారణ జరుపుతున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *