సోషల్ మీడియా వేదికల్లో అసభ్యకరంగా మాట్లాడటం, అశ్లీలతను ప్రేరేపించే విధంగా వీడియోలు పోస్ట్ చేయడంపై నటి దర్శా గుప్తా (Dharsha Gupta) సహా 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వారందరినీ అరెస్ట్ చేసేందుకు పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టారు.
సేలంకు చెందిన న్యాయవాది అజిత్ నగర సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో.. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో కొందరు 18 ఏళ్ల లోపు యువత, మైనర్లను తప్పుదోవ పట్టించేలా, వారికి హాని కలిగించే విధంగా కంటెంట్ను పోస్ట్ చేస్తున్నారని పేర్కొన్నారు.
ముఖ్యంగా తిరుచ్చి సాధన, నటి దర్శా గుప్తా, సూర్య ప్రభ, హనీ చెన్నై, అభినయ చిత్ర, ప్రియాంక రాజ్, శరణ్య, సంతోష్ సహా 12 మంది సోషల్ మీడియా లైవ్లలోకి వచ్చి అసభ్యకరంగా, శృతిమించిన వ్యాఖ్యలు చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారని ఆరోపించారు.
వీరి చర్యల వల్ల యువత, భావి తరాలు తీవ్రంగా ప్రభావితమై పెడదోవ పడుతున్నారని, అందువల్ల సోషల్ మీడియాలో అసభ్య ప్రవర్తనకు పాల్పడుతున్న వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయవాది తన ఫిర్యాదులో కోరారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా ప్రాథమిక విచారణ చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు.. నటి దర్శా గుప్తా, తిరుచ్చి సాధన సహా మొత్తం 12 మందిపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితులను త్వరితగతిన అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Leave a Reply