2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏటా కొత్తగా క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్య 3.5 కోట్లకు చేరుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరియు అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధనా సంస్థ (IARC) సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏటా 2.06 కోట్ల మంది కొత్తగా క్యాన్సర్ బారిన పడుతున్నట్లు నిర్ధారణ అవుతోంది.
అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ 26 వేల మందికి పైగా క్యాన్సర్తో మరణిస్తున్నారని, ప్రస్తుతం ఏడాదికి సుమారు 1 కోటి మరణాలు నమోదవుతున్నాయని నివేదిక వెల్లడించింది. గుండె సంబంధిత వ్యాధుల తర్వాత ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధిగా క్యాన్సర్ నిలుస్తోంది.
క్యాన్సర్ కేసుల్లో దాదాపు 40 శాతం కేసులు పొగాకు వాడకం, మద్యపానం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV), హెపటైటిస్ వంటి నివారించదగిన కారణాల వల్లే వస్తున్నాయని పేర్కొన్నారు.
అల్పాదాయం కలిగిన పేద దేశాల్లో క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తించడానికి, సరైన చికిత్స పొందడానికి తగిన వైద్య సదుపాయాలు లేక తీవ్రమైన అసమానతలు నెలకొన్నాయని ఆ నివేదిక స్పష్టం చేసింది.

Leave a Reply