హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను, పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకి సున్నితమైన సమాచారం సరఫరా చేశారన్న ఆరోపణలపై అరెస్టు చేశారు.
నిఘా సంస్థల ప్రకారం, జ్యోతి రూపొందించిన సరిహద్దు ప్రయాణ వీడియోలు – ముఖ్యంగా రాజస్థాన్లోని థార్ ఎడారిలో ఏడాది క్రితం చిత్రీకరించిన వీడియో – విచారణలో కీలక ఆధారంగా మారాయి. సాధారణంగా దేశ సరిహద్దు ప్రాంతాల విజువల్స్ను చూపించేలా కనిపించిన వీడియోలు, వాస్తవానికి ప్రణాళికాబద్ధమైన నిఘా చర్యగా అనుమానిస్తున్నారు.
జ్యోతి ఆ ప్రాంతాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి, అక్కడి ప్రజలు, సైనిక స్థావరాలు, భూభాగం స్వరూపం మరియు సరిహద్దు కంచెలను వివరంగా వీడియోల్లో చూపించినట్టు తెలుస్తోంది.
ఇదే కాకుండా, ఆమె అట్టారి మరియు ఆఫ్ఘన్ సరిహద్దు ప్రాంతాల్లో తీసిన వీడియోలు కూడా నిఘా ఏజెన్సీల దృష్టికి వచ్చాయి. ఈ వీడియోల ద్వారా సైనిక కదలికలపై, భద్రతా లోపాలపై సమాచారాన్ని పంచుకున్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది.
జ్యోతి, ఇండో-పాక్ సరిహద్దును చూపించే చేతితో వేసిన మ్యాప్ను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఆ వీడియోలు పాకిస్తాన్కి చెందిన చొరబాటుదారులకు ఉపయోగపడినట్టు అధికారులు భావిస్తున్నారు.
ఒక వీడియోలో, జ్యోతి సరిహద్దు వద్ద “ఇక్కడ ఇళ్ళు లేవు” అని వ్యాఖ్యానించగా, ఈ దృశ్యం భారత గ్రామాల్లోకి చొరబాటుకు గల అవకాశాలను సూచించవచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
దర్యాప్తులో కీలకమైన మరొక అంశం – జ్యోతి మల్హోత్రా, ఐఎస్ఐ అధికారులుగా అనుమానిస్తున్న డానిష్ మరియు అలీ హసన్లతో వాట్సాప్ ద్వారా సంప్రదింపులు జరిపినట్టు గుర్తించారు. అలాగే, స్నాప్చాట్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా కూడా సమాచార మార్పిడులు జరిగాయని తెలుస్తోంది.
అలీ హసన్తో జరిగిన సంభాషణలో, హసన్ చెప్పిన “మీ ఆనందం కోసం నా హృదయం ప్రార్థిస్తుంది” అనే సందేశానికి జ్యోతి నవ్వుతున్న ఎమోజీతో స్పందిస్తూ, “నన్ను పాకిస్తాన్లో పెళ్లి చేసుకోండి” అన్నదని విచారణలో వెల్లడైంది.
జ్యోతి మల్హోత్రా సంబంధాలపై దర్యాప్తు కొనసాగుతున్నది. అతనితో ముడిపడిన నలుగు బ్యాంకు ఖాతాలను గుర్తించిన పోలీసులు, వాటిలో ఒక ఖాతాకు దుబాయ్ నుండి వచ్చిన అనుమానాస్పద విదేశీ ఫండ్స్పై విచారణ చేపట్టారు.
దర్యాప్తులో, జ్యోతి ఈ సంబంధం 2023లో ప్రారంభమైందని తెలిపాడు. ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి వీసా కోసం వెళ్లినప్పుడు డానిష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిందని చెప్పాడు. తరువాత అతని సహాయంతో పాకిస్తాన్కి వెళ్లగా, అక్కడ అలీ హసన్ సహా పలువురు ఐఎస్ఐ అధికారులతో పరిచయమయ్యారని పేర్కొన్నాడు.
గూఢచర్యానికి పాల్పడకుండా ఉండేందుకు, పాకిస్తానీయుల నంబర్లను ‘జాట్ రంధావా’ వంటి పేర్లతో తన ఫోన్లో సేవ్ చేసుకున్నట్టు జ్యోతి అంగీకరించారని సమాచారం.
Leave a Reply