కోటా, రాజస్థాన్: బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని పాతాళానికి తీసుకెళ్లే ఘటన ఇది. ICICI బ్యాంక్ కోటా బ్రాంచ్లో కస్టమర్ సర్వీస్ మేనేజర్గా పనిచేస్తున్న సాక్షి గుప్తా అనే యువతి, నాలుగేళ్లలో రూ. 4.58 కోట్ల మోసం చేసి పోలీసుల చేతిలో చిక్కుకుంది.
మోసం ఎలా జరిగింది?
సాక్షి గుప్తా 2020 నుండి 2023 మధ్యకాలంలో 110 మంది ఖాతాదారుల డేటాతో చలాకీగా చెలగాటం ఆడింది. ప్రధానంగా 41 మంది ఖాతాదారుల మొబైల్ నంబర్లను మారుస్తూ, వారు గుర్తించకుండానే విత్డ్రా లావాదేవీలు, ఫిక్స్డ్ డిపాజిట్ బద్దలుకు పాల్పడింది.
ఒక వృద్ధ మహిళా ఖాతాదారుడి ఖాతా నుంచే ₹3.22 కోట్లు మాయం చేసింది.
మొత్తం ₹1.34 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లను బద్దలుగా మార్చింది.
ఇంకా ₹3.4 లక్షల వ్యక్తిగత రుణాలు కూడా తప్పుడు పద్ధతిలో తీసుకుంది.
Insta Kiosk, డిజిటల్ ఛానెల్స్, డెబిట్ కార్డుల ద్వారా లావాదేవీలు సాగించింది.
OTP & అలర్ట్స్ కూడా బ్లాక్
ఈ మోసం బయటపడకుండా ఉండేందుకు, సాక్షి కస్టమర్లకు వచ్చే OTPలు, అలర్ట్ మెసేజ్లు అందకుండా చేయడం కోసం వారి కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లను ఖాతాల్లో రిజిస్టర్ చేసి పెట్టింది.
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు – కానీ లాభం లేదు
ఆమె తీసుకున్న డబ్బుతో తన కుటుంబ సభ్యుల పేరిట స్టాక్ మార్కెట్లో ₹40-₹50 లక్షల వరకు పెట్టుబడి పెట్టింది. కానీ ఆ పెట్టుబడులు ఫలించక, భారీ నష్టం ఎదురయ్యింది. దీంతో బ్యాంక్ లోపల అనుమానాలు మొదలై, విచారణ చేపట్టారు.
పట్టుబడిన తీరు
DCM బ్రాంచ్ మేనేజర్ తరుణ్ డాడిచ్ ఫిబ్రవరి 18, 2025న పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం మే 31న సాక్షిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె కోర్టు రిమాండ్లో ఉంది.
సాక్షి భర్త కూడా బ్యాంక్ ఉద్యోగి
సాక్షి 2023లో శరద్ గుప్తా అనే మరో బ్యాంకు ఉద్యోగిని వివాహం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం అతను వేరే బ్యాంకులో పనిచేస్తున్నాడు. ఈ మోసంలో అతనికి సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Leave a Reply