ప్యాంగ్యాంగ్: పశ్చిమ ఆసియాలో యుద్ధం తీవ్రంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ ఇరాన్కు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. ఇరాన్ కోరినట్లయితే, ఇజ్రాయెల్ను ఎదుర్కోవడానికి అవసరమైన క్షిపణులను అందించడానికి ఉత్తర కొరియా సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు.
ఇజ్రాయెల్ను ప్రపంచ పటం నుండి తుడిచిపెట్టడానికి తమ దగ్గర ఉన్న ఒక్క క్షిపణి సరిపోతుందని కిమ్ పేర్కొన్నట్లు చైనా మీడియా సంస్థ ‘చైనా లైవ్’ నివేదించింది. అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు ఇరాన్ లక్ష్యంగా చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ (Operation Epic Fury) కొనసాగుతున్న సమయంలో ఉత్తర కొరియా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇరాన్ మరియు ఉత్తర కొరియా మధ్య దశాబ్దాలుగా సన్నిహిత సైనిక సంబంధాలు ఉన్నాయి.
ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు విధానాల వల్ల ఏ క్షణమైనా మూడవ ప్రపంచ యుద్ధం సంభవించవచ్చని రష్యా ఇప్పటికే హెచ్చరించింది. తాజాగా ఉత్తర కొరియా కూడా రంగంలోకి దిగడంతో, ఈ ఉద్రిక్తతలు ప్రపంచ అణు యుద్ధానికి దారితీస్తాయేమోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

Leave a Reply