ఇజ్రాయెల్‌లో ఎర్రని ఆవు దూడ జననం: ఇది లోకాంతానికి సంకేతమా? బైబిల్ జోస్యం ఏం చెబుతోంది?

ప్రపంచం అంతం కాబోతోందనే విషయమై చరిత్రలో అనేక రకాల జోస్యాలు ఉన్నాయి, వాటిలో చాలా వరకు పూర్తిగా నిరాధారమైనవి. ఉదాహరణకు, 2012లో మాయన్ క్యాలెండర్ ప్రకారం ప్రపంచం అంతమవుతుందని ప్రచారం జరిగింది, కానీ అది తప్పు అని తేలింది.

అయితే, ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో జరిగిన ఒక వింత ఘటన మళ్ళీ చర్చకు దారితీసింది. అక్కడ ఒక ‘ఎర్రని ఆవు దూడ’ (Red Heifer) జన్మించడం లోకాంతానికి సంకేతమని కొందరు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

క్రైస్తవ, యూదు మత గ్రంథాల్లో ‘రెడ్ హెఫర్’ ప్రాముఖ్యత
వార్తల ప్రకారం, ఇజ్రాయెల్‌లో దాదాపు 2000 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఎర్రటి ఆవు దూడ జన్మించింది. సోషల్ మీడియాలో ఈ వార్త దావానంలా వ్యాపించింది. క్రైస్తవ మరియు యూదు మత గ్రంథాల ప్రకారం, ఇలాంటి అరుదైన ఎర్రని ఆవు దూడ జననం రాబోయే వినాశనానికి లేదా మసీదు ఆగమనానికి సంకేతం.

టెంపుల్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధన
జెరూసలేంకు చెందిన ‘టెంపుల్ ఇన్‌స్టిట్యూట్’ ఈ నవజాత దూడను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఈ దూడ నిజంగానే పూర్తిగా ఎర్రగా ఉందా, లేదా ఇతర రంగు వెంట్రుకలు ఉన్నాయా అనేది నిపుణులు నిర్ధారించాల్సి ఉంది.

బైబిల్ ప్రకారం, మచ్చ లేని పూర్తి ఎర్రని ఆవు దూడ జననం ‘యూదు మసీదు’ (Jewish Messiah) రాకను మరియు జెరూసలేంలో మూడవ దేవాలయం (Third Temple) పునర్నిర్మాణాన్ని సూచిస్తుంది. ఈ పరిణామం ప్రపంచ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయవచ్చని, అదే లోకాంతానికి దారితీస్తుందని కొందరు విశ్వసిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *