బాలీవుడ్: ఒకప్పుడు బాలీవుడ్ నటి పూజా భట్, నటుడు బాబీ డియోల్ ప్రేమలో ఉండేవారు. అయితే, వారి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. కాలక్రమేణా వారు విడిపోయారు. బాబీ డియోల్ ప్రస్తుతం తాన్య డియోల్ను వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉంటుండగా, పూజా భట్ 2003లో మనీష్ మఖీజాను వివాహం చేసుకుని, 11 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. తాజాగా పూజా భట్ తన పాత బంధం, విడిపోవడం గురించి స్పష్టంగా మాట్లాడారు.
బాబీ డియోల్తో ఆ అనుబంధం.. ఒక ఇంటర్వ్యూలో పూజా భట్ మాట్లాడుతూ, “నేను బాబీని ప్రేమించాను. ఆయన్ని ప్రేమించకుండా ఉండే కారణమే లేదు. అది నా జీవితంలో ఒక మధురమైన దశ. ఆయనతో గడిపిన సమయం ఒక అద్భుతమైన అనుభవం. ఆ బంధం ఎందుకు ముగిసిందనే విషయాలను ఇప్పుడు చర్చించడం సరికాదు. జరిగిందేదో జరిగింది. మేం ఎప్పుడూ మా బంధాన్ని దాచలేదు. బాబీ ఇప్పుడు వివాహబంధంలో ఉండి, పిల్లలతో సంతోషంగా ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ‘యానిమల్’ చిత్రంలో ఆయన నటన నాకు చాలా నచ్చింది” అని అన్నారు.
గౌరవం ముఖ్యం: ఆమె ఇంకా మాట్లాడుతూ, “ఒక వ్యక్తితో గడిపిన కాలాన్ని, ఆ బంధాన్ని నేను తక్కువ అంచనా వేయను. ఒక బంధం ఎంత కాలం ఉండాలో అంతే కాలం ఉంది, అంతే. మన జీవితంలో ఒకప్పుడు భాగంగా ఉన్న వ్యక్తుల పట్ల ఎప్పుడూ గౌరవం, హుందాతనం కలిగి ఉండాలి. అది చాలా ముఖ్యమైన విషయం” అని పూజా భట్ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం బాబీ డియోల్ తన కెరీర్లో మంచి దశను ఆస్వాదిస్తున్నారు. త్వరలోనే ఆయన ‘బందర్’ అనే చిత్రంలో కనిపించనున్నారు.
