ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఒక దారుణమైన సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. వేవ్ సిటీ ప్రాంతంలోని ‘ఆదిత్య వరల్డ్ సిటీ’ కాలనీలో నివసించే దంపతులను ఆన్లైన్ మోసగాళ్లు బురిడీ కొట్టించి, రూ. 3.68 లక్షలు కాజేశారు.
ఏం జరిగింది? మనోజ్ ఉపాధ్యాయ మరియు అంజలి శర్మ దంపతులు గతంలో నోయిడాలోని ఒక కంపెనీలో పనిచేసేవారు. ఇటీవల ఉద్యోగం కోల్పోవడంతో, పార్ట్-టైమ్ పని కోసం వెతుకుతుండగా టెలిగ్రామ్లో ఒక గ్రూపులో చేరారు. అందులో ‘మీషో ఆన్లైన్ షాపింగ్’ పేరుతో టాస్క్లు పూర్తి చేస్తే కమీషన్ ఇస్తామని నమ్మబలికారు.
మోసం ఎలా మొదలైందంటే..
- మొదట రూ. 100 టాస్క్ ఇస్తే రూ. 200 ఇచ్చారు. తర్వాత రూ. 500 పెడితే రూ. 1,000 ఇచ్చారు.
- వీరిద్దరి నమ్మకాన్ని చూరగొన్న మోసగాళ్లు, ఆ తర్వాత పెట్టుబడిని పెంచుకుంటూ వెళ్లారు. దంపతులు వివిధ బ్యాంక్ ఖాతాలకు మొత్తం రూ. 3,68,100 ట్రాన్స్ఫర్ చేశారు.
- ఒక దశలో చెల్లింపులను ఆపేసి, “మొత్తం డబ్బు రావాలంటే 20 టాస్క్లు పూర్తి చేయాలి” అని కండిషన్ పెట్టారు. 17 టాస్క్ల వరకు పూర్తి చేశాక, ఎటువంటి సమాధానం రాకపోవడంతో దంపతులకు తాము మోసపోయామని అర్థమైంది.
పోలీసుల చర్య: బాధితులు వేవ్ సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఐపిసి సెక్షన్ 418(4) మరియు ఐటి యాక్ట్ సెక్షన్ 66డి కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
