బల్లియా: ఉత్తరప్రదేశ్ లోని బల్లియా జిల్లాలో ఒక ఘోరమైన, సంచలన సంఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం ఏడాది క్రితమే పెళ్లయిన తన భార్యను ఓ భర్త తన ప్రియురాలితో కలిసి అత్యంత క్రూరంగా హత్య చేశాడు. ఈ కేసులో పోలీసులు నిందితుడైన భర్తను, అతనికి సహకరించిన ప్రియురాలిని శుక్రవారం నాడు అరెస్ట్ చేశారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. మే 24న బల్లియా సిటీ పరిధిలోని శివపూర్ దియార్ సమీపంలో ఒక గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. దర్యాప్తులో ఆ మృతదేహం రేవతి పట్టణానికి చెందిన ప్రీతి దేవి (22)గా గుర్తించారు. బహదూర్పూర్ కారికి చెందిన ప్రీతి తండ్రి శ్యామ్ దేవ్ ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా, భారతీయ న్యాయ సంహిత (BNS) మరియు కట్న నిషేధ చట్టం కింద మొత్తం 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పెళ్లయిన ఏడాదికే కట్నం వేధింపులు
ప్రీతి తండ్రి శ్యామ్ దేవ్ తన ఫిర్యాదులో.. 2025 మార్చి 6న ప్రీతికి చున్నీలాల్ ప్రజాపతితో వివాహమైందని తెలిపారు. పెళ్లయినప్పటి నుంచే అదనపు కట్నం కోసం తన కూతురిని అత్తగారి ఇంట్లో శారీరకంగా, మానసికంగా వేధించేవారని ఆరోపించారు. మే 22న తన కూతురు అకస్మాత్తుగా కనిపించకుండా పోయిందని తమకు సమాచారం అందిందని ఆయన పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ ఓంవీర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కేసులో ప్రధాన నిందితుడైన చున్నీలాల్ (25), అతని ప్రియురాలు శోభా చౌరాసియా (21)లను పోలీసులు అరెస్ట్ చేశారు.

Leave a Reply