17 ఏళ్ల మైనర్ బాలుడితో ప్రేమ వివాహం: 22 ఏళ్ల యువతికి ఊరి పంచాయితీ ఇచ్చిన షాకింగ్ తీర్పు!

పాట్నా: భారతదేశంలో వివాహ చట్టాల ప్రకారం పురుషులకు 21 ఏళ్లు, మహిళలకు 18 ఏళ్లు కనీస వయసుగా నిర్ణయించారు. అయితే, ఇప్పటికీ దేశంలో బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. సాధారణంగా ఇటువంటి ఘటనల్లో బాలికలే బాధితులుగా మారుతుంటారు. కానీ, బీహార్‌లో జరిగిన ఈ తాజా ఉదంతంలో ఒక 17 ఏళ్ల బాలుడు బాల్య వివాహానికి బాధితుడయ్యాడు.

బీహార్ రాష్ట్రం మాధేపురా జిల్లాలో ఈ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ప్రాంతానికి చెందిన పూజా కుమారి అనే యువతి, తన ఇంటి సమీపంలో నివసించే 17 ఏళ్ల మైనర్ బాలుడితో స్నేహం పెంచుకుంది.

వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్తా కాలక్రమేణా ప్రేమగా మారింది. మన దేశంలో ఇటువంటి ప్రేమకథలు కొత్తేమీ కాదు; చాలా మంది సినీ ప్రముఖులు కూడా తమకంటే వయసులో చిన్నవారిని వివాహం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే, 17 ఏళ్ల బాలుడిని వివాహం చేసుకోవడం అనేది చట్టరీత్యా ‘పోక్సో’ (POCSO) కేసు కిందకు వస్తుంది. ఇవేమీ తెలియని పూజా కుమారి, ఆ మైనర్ బాలుడితో తరచూ ఏకాంతంగా గడుపుతూ ప్రేమలో మునిగిపోయింది.

అసలేం జరిగిందంటే?
ఊరిలో ఇలాంటి విషయాలు జరిగితే ఎవరికీ తెలియకుండా ఉండవు. వీరి ప్రేమకథ మెల్లమెల్లగా బయటకు తెలియడంతో బంధువులు కొందరు మందలించారు. అయినప్పటికీ, వారు అవేమీ పట్టించుకోకుండా తమ బంధాన్ని కొనసాగించారు. ఒకానొక దశలో ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

సినిమా ఫక్కీలో పెళ్లికి ప్లాన్ చేశారు. పక్క ఊరిలోని ఒక గుడిలో మాలలు మార్చుకుని, పెళ్లి దుస్తుల్లో తమ ఊరిలోకి ప్రవేశించారు. వీరిని చూడగానే షాక్‌కు గురైన బాలుడి తల్లిదండ్రులు.. రోడ్డు మీదనే యువతి పూజా కుమారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ గొడవను ఆపాల్సిన ఇతరులు కూడా పూజా జుట్టు పట్టుకుని లాగుతూ దారుణంగా కొట్టడం స్థానికంగా సంచలనం సృష్టించింది.

కులాంతర వివాహం కావడమే కారణమా?
ఈ పెళ్లిని తల్లిదండ్రులు వ్యతిరేకించడానికి వయసు ఒక కారణం అయితే, వీరిద్దరూ వేర్వేరు కులాలకు చెందిన వారు కావడం మరో ప్రధాన కారణమని సమాచారం. అందుకే వరుడి తరపు వారు పూజాపై అంతలా విరుచుకుపడ్డారని తెలుస్తోంది. ఈ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *