శివగంగ: తమిళనాడులోని శివగంగ జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ (AR) విభాగంలో పనిచేస్తున్న ఒక వివాహిత మహిళా కానిస్టేబుల్పై.. ముగ్గురు కామాంధులు దారుణంగా సామూహిక అత్యాచారానికి (గ్యాంగ్ రేప్) ఒడిగట్టిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
సదరు మహిళా కానిస్టేబుల్కు మానామదురై సమీపంలోని తూదై గ్రామానికి చెందిన రాబిన్ (28) అనే లారీ డ్రైవర్తో పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ స్నేహితులుగా ఉంటున్న క్రమంలో.. గత కొన్ని రోజుల క్రితం రాబిన్ ఆ మహిళా కానిస్టేబుల్కు ఫోన్ చేసి, అత్యవసరంగా కలవాలని కోరాడు. తెలిసిన స్నేహితుడే కదా అని నమ్మిన ఆమె.. శివగంగ-తిరుపత్తూరు రహదారిలోని ఒక నిర్దేశిత ప్రాంతానికి అతడిని కలవడానికి వెళ్లారు.
నమ్మించి పొదల్లోకి లాసుకెళ్లి..
ఆ సమయంలో రాబిన్.. సదరు మహిళా కానిస్టేబుల్ను జనసంచారం లేని ఒక పొదల్లోకి బలవంతంగా లాసుకెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాడు. దీనితో షాక్కు గురైన ఆమె.. అతడి బారి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. కానీ, అదే సమయానికి రాబిన్ స్నేహితులైన చిత్తాలంగుడి గ్రామానికి చెందిన మహారాజా (29) మరియు కాలేజీ విద్యార్థి హరీష్ (21) అక్కడికి చేరుకున్నారు. అనంతరం ఆ ముగ్గురూ కలిసి మహిళా కానిస్టేబుల్పై అమానుషంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి బారి నుండి ఎలాగోలా ప్రాణాలతో తప్పించుకున్న సదరు కానిస్టేబుల్.. సమీపంలోని ఇళ్లకు పరుగులు తీసి సహాయం కోరింది.
పోలీసుల వేగవంతమైన చర్యలు – నిందితుల అరెస్ట్:
దీనితో స్థానిక ప్రజలు వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 100కి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళా కానిస్టేబుల్ను సురక్షితంగా రక్షించి, ఆసుపత్రికి తరలించారు. ఈ ఘోర కలికృత్యం శివగంగ జిల్లా ఎస్పీ (SP) శివప్రసాద్ దృష్టికి వెళ్లడంతో.. ఆయన ఆదేశాల మేరకు డీఎస్పీ అమల అడ్విన్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మారీశ్వరి నేతృత్వంలో ప్రత్యేక బృందాలను (Special Teams) ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.
బాధితురాలైన మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం.. లారీ డ్రైవర్ రాబిన్, అతని స్నేహితుడు మహారాజా, కాలేజీ విద్యార్థి హరీష్లను అత్యంత వేగంగా అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో వారి నేరం నిరూపితం కావడంతో.. ముగ్గురిపై గ్యాంగ్ రేప్ సహా పలు కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అధికారికంగా అరెస్ట్ చేశారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యతల్లో ఉండే ఒక మహిళా పోలీస్ కానిస్టేబుల్కే ఇలాంటి ఘోర పరిస్థితి ఎదురుకావడం శివగంగ జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని, భయాందోళనలను రేకెత్తించింది.

Leave a Reply